Posts

Moral story of the year

 ఓ అత్తకి👵🏻ముగ్గురు అల్లుళ్ళు...👨🏻👨🏻‍🦱🧔🏻 వాళ్ళలో ఏ అల్లుడు మంచోడో తెలుసుకోవాలి అనుకుంది...👵🏻 మొదటి రోజు పెద్ద అల్లుడును👨🏻తీసుకుని సముద్రంలోకి వెళ్ళింది...👣👣 అక్కడ అత్త సముద్రంలో పడిపోయింది...🌊👵🏻 పెద్ద అల్లుడు కాపాడతాడు...🕴🏻 అత్త👵🏻...నా అల్లుడు👨🏻 చాలా మంచి వాడు అని కార్ కొని ఇచ్చింది...🚗 రెండో రోజు...రెండో అల్లుడును👨🏻‍🦱అదే చోటుకు తీసుకెళ్ళి👣👣 మళ్లీ సముద్రంలో పడింది...🌊👵🏻 రెండో అల్లుడు👨🏻‍🦱కూడా కాపాడతాడు...🕴🏻 అత్త👵🏻...రెండో అల్లుడు👨🏻‍🦱కూడా మంచోడు అని బైక్ కొని ఇచ్చింది...🏍️ మూడో రోజు...మూడో అల్లుడిని🧔🏻తీసుకెళ్ళింది...👣👣 అత్త మళ్ళీ సముద్రంలో పడిపోయింది...🌊👵🏻 మూడో అల్లుడు🧔🏻బాగా ఆలోచించాడు...🧔🏻 మొదటి అల్లుడికి కార్ ఇచ్చింది...🚗 రెండో వాడికి బైక్ ఇచ్చింది...🏍️ ఇక మిగిలింది కేవలం సైకిల్ మాత్రమే...🚲 ఇప్పుడు అత్తను👵🏻రక్షిస్తే అదే ఇస్తుంది...🚲 అది నేను🧔🏻ఏం చేసుకుంటాను అని అత్తను సముద్రంలో వదిలేసాడు...🌊👵🏻 ఇంటికి వచ్చేసాడు...🧔🏻 ఆశ్చర్యం...🕴🏻 తర్వాత రోజు చూస్తే ఇంటి ముందు BMW🚘 కారు కానుకగా వచ్చింది...🧔🏻 ఎలా....??? . .. ... ...

ముచ్చట గొలిపే మృదువైన పాదం

Image
 ముచ్చట గొలిపే మృదువైన పాదం శంఖాకారం శుభప్రదం అలరించే పారాణి సోయగం జీరాడే పట్టుపావడా సువర్ణ వర్ణ అంచు సహజ అలంకారం మువ్వల పట్టీ సవ్వడి వీనులవిందైన సంగీతనాదం నఖ సిరి సైతం శోభాయమానం పద్మంలాంటి పాదద్వయం తమలపాకులాంటి నాజూకుదనం నయనమనోహరం! క్రిష్

గోదారోళ్ల ఏటకారం

Image
  సేనా ఏళ్ళ క్రితం ... విదేశాల నుండి ఒక తెల్ల దొర భారతదేశం ...అందులోను మన గోదావరి జిల్లాకి వచ్చి ... అక్కడ గోదారొడైన ఒక టాక్సీ డ్రైవర్ ని గోదావరి జిల్లాలు మొత్తం తిప్పి చూయించేటట్టు మాట్టాడుకొని బయల్దేరాడాటండి ... మొదటగా మన డ్రైవర్ దొరవారిని మన ద్వారకా తిరుమల దేవస్థానం కి తీసుకెల్తే .. ఆ గుడి మొత్తం తిరిగి చూసాక ...ఈ గుడి మొత్తం కట్టనీకి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటావ్ అని అడిగితే ..మన డ్రైవర్ ఏమో ఒక పదేళ్లు పట్టి ఉంటుందేమో సార్ అంటె ...దానికి దొర గారు ... అంత కాలం పట్టిందా ...మా దేశం లో అయితే ఐదేళ్లలో కట్టేసేవోరు తెలుసా ..మీరు బాగా ఎనకపడిపోయారని అంటూ గొప్పలు పోయాడటండి .. .అక్కడ మొదలు ఏలూరు...తాడేపల్లి గూడెం ... తణుకు ... ఇలా ఏ వూరిలో ఏ గుడి, కట్టడం చూయించినా ... ఎంత కాలం లో కట్టేరు అని అడగటం ... మా దేశం లో అయితే సగం కాలం లో కట్టేసేవోరు అని పేలడం సేత్తన్నాడటండి ... దీంతో  కడుపు రగిలి పోతున్న మన డ్రెవర్ బాబు ... మన రోడ్ కం రైల్ బ్రిడ్జి దగ్గరికి వచ్చేదరికి ... బ్రిడ్జి ముందు కారు ఆపి దిగి  సూత్తా ఉంటే ... ఎనకమాలే కారు దిగిన దొరగారు ... ఈ బ్రిడ్జి ఎంతకాలంలో కట్టేరో అని అడిగీస...

Ek mini katha

హైదరాబాద్ సిటీ లో పెద్ద పేరున్న బిసినెస్ మాన్ అయిన అప్పల నాయుడు కొడుకు విశాల్  ఒక బాగా పేరు  ఉన్న జోతిష్యుడు "గోపాల్ శాస్త్రి " గారి  దగ్గర జాతకం చెప్పించుకోవటం  కోసం వెళ్లారు   విశాల్ ఇంక  అతని తండ్రి , అయితే  ఆ జ్యోతిష్కుడు  విశాల్ వాళ్ళ తండ్రి కి  " మీరు  సరిగ్గా   ౩౦ రోజులలో చనిపోతారు చనిపోతారు" అని చెప్తాడు  ఆశ్చర్యంగా  కరెక్ట్ గా  ఆ  జ్యోతిష్కుడు   చెప్పిన తేదీ  రోజే విశాల్ తండ్రి చని పోవటం జరుగుతుంది  తండ్రి  మరణం  విశాల్ ని చాల డిప్రెస్ చేస్తుంది... కానీ అతనికి  అర్ధం కానీ  విషయం ఏమిటంటే ఆ జ్యోతిష్కుడు   చెప్పిన డేట్  కె  ఎలా చనిపోయారా  అని ... ఇదే విషయం విశాల్ ఫ్రెండ్ అయిన "పోలీస్ SI వేణు " కి ఫోన్ చేసి  వివరిస్తాడు విశాల్ " అంత కచ్చితంగా ఆ జ్యోతిష్కుడు  చేపి చెప్పిన  రోజే ఎలా చనిపోతారు రా ఎవరైనా  ....  మన చావు మన చేతుల్లో ఉండదు కదా అది హత్యో లేక అతను సూసైడ్ అట్టెంప్ట్ చేస్తే తప్పితే ..." అన్నాడు విశాల్...

SIR author Cotton musuem

Image
 సర్ ఆర్థర్ కాటన్ మ్యూజియం 1998 లో  ధవళేశ్వరంలో నిర్మించబడింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఏకైక సివిల్ ఇంజనీరింగ్ మ్యూజియం. కాటన్ మ్యుజియం కాటన్ ఆనకట్ట గురించిన చరిత్రను వివరిస్తుంది. కాటన్ గారు అప్పట్లో  ఆనకట్ట నిర్మాణంలో వాడిన 160 సంవత్సరాలనాటి పురాతన యంత్రాలు (రివెటింగ్ యంత్రం, స్టీం బాయిలర్లు, కంప్రెసర్లు, సానపట్టు యంత్రాలు, బోరింగ్ యంత్రాలను ఉంచారు. ముఖ్యభవనానికి కుడివైపున అలనాటి రెండు పిరంగులను ఉంచారు. ఆనకట్ట కట్టుటకు కాటన్ ఉపయోగించిన పద్ధతులు, అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించే చిత్రాలు ఇక్కడ చాలా ఉన్నాయి.  కాటన్ దొర మునిమనుమడు ఈ మ్యూజియాన్ని సందర్శించినప్పుడు వ్రాసిన స్పందన చిత్రము ఉంది.  మ్యూజియం బయట అవరణలో గోదావరినది నాసిక్ లోపుట్టి బంగాళాఖాతంలో కలియువరకు చూపించే నమూనాకలదు. ఆంధ్రప్రదేశ్ నుండి విశిష్ట సందర్శకులతో పాటు, విద్యార్థులు వారి విద్యా పర్యటనల్లో భాగంగా సందర్శిస్తున్నారు.  ఇతర రాష్ట్రాలు మరియు ఇతర దేశాల సందర్శకులు మ్యూజియాన్ని సందర్శిస్తున్నారు

Pottery Making

Image
మట్టి కుండ మహా అద్భుతం.   కుమ్మరులు సమీపంలోని చెరువు నుండి మెత్తని ఒండ్రుమట్టి సేకరించి తీసుకొచ్చి దానిని మరింత మెత్తగా చేసి అందులో ఉన్న రాళ్ళను, చెత్తను వేరుచేసి దానిని నీళ్ళతో కలిపి నాలుగైదు రోజులు మగ్గబెడతారు. ఆ తర్వాత నీళ్ళు పోసి కాళ్ళతో బాగా  తొక్కుతారు. ఈ మట్టిని కుమ్మరి చక్రంపై రెండడుగులు స్తూపాకారంగా పెట్టి చక్రాన్ని కట్టెతో తిప్పి కుండను తయారు చేస్తారు.    ఇవి పచ్చిగా సున్నితంగా వుంటాయి. వీటిని ఒకరోజు నీడలో ఆరబెట్టి ఆ తర్వాత కుండలోపల చేతిపెట్టి పైన కొట్టడంతో సాగి కింద వున్న రంధ్రం మూసుకుపోతుంది. తర్వాత నీడలో ఆరబెడతారు. కుమ్మరి వాము కుండలు కాల్చడానికి ఉపయోగించే బట్టి (పొయ్యి)లో ఒక రోజు కాల్చి, ఆ వాము చల్లారిన తరువాత తీసే విధానం కుండను తయారు చేసే విధానం